ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ

5 Aug, 2016 10:21 IST|Sakshi

తిరుమల: అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉండే 40 వేల ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో సుప్రభాతం సేవాటికెట్లు : 5,477, తోమాల సేవా టికెట్లు : 80, అర్చన: 80, విశేష పూజ:1,125, అష్టదళ పాదపద్మారాధన: 40, నిజపాదం:1,125, కల్యాణోత్సవం: 7,875, ఊంజల్‌సేవ: 2,100, ఆర్జిత బ్రహ్మోత్సవం: 4,515, వసంతోత్సవం: 8,170, సహస్ర దీపాలంకార సేవ: 9,500 టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. వీటిని శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి టీడీడీ వెబ్‌సైట్‌లో ముందుగానే కొనుగోలు చేసుకోవచ్చని భక్తులకు అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు