ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

23 Sep, 2016 02:05 IST|Sakshi
దెందులూరు: ఆటో బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. దెందులూరు గ్రామానికి చెందిన సేనాపతి నాగరాజు (32) ప్యాసింజర్‌ ఆటోలో బుధవారం ఏలూరు నుంచి దెందులూరు వస్తుండగా రైల్వే స్టేçÙన్‌ సమీపంలో రోడ్డుపై ఆటో బోల్తా పడింది. దీంతో నాగరాజు ఛాతీ నొక్కుకుపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన నాగరాజును దెందులూరులో అతని నివాసానికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 

 

>
మరిన్ని వార్తలు