నంద్యాల: కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా స్థానిక సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ ఎంపికయ్యారు. తిరుపతిలో శనివారం జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కర్నూలుకు చెందిన జయరెడ్డి ఎన్నికయ్యారు. మెడికల్ కౌన్సిల్ తరహాలో సైకాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.