1500 మందితో రిహార్సల్స్‌

6 Oct, 2016 23:06 IST|Sakshi
1500 మందితో రిహార్సల్స్‌

సాక్షి,సిటీబ్యూరో:  బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం ఎల్బీస్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. గురువారం 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడి రిహార్సల్స్‌ నిర్వహించారు.

ఓనం తరహాలో ఒకే చోట 10వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడించి గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించాలని నిర్ణయించారు. 9న సద్దుల బతుకమ్మ సందర్భంగా 10 వేలు, అంతకంటే ఎక్కువ మంది మహిళలను ఒక్కచోట చేర్చాలని పర్యాటక, సాంస్కృతిక శాఖలు నిర్ణయించాయి. టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జడ్‌ ఛోంగ్తూ, అధికారులు దినకరబాబు, సాంస్కృతికడైరెక్టర్‌ మామిడి హరికృష్ణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు