ఎందుకీ కక్ష, మేం ఏం తప్పు చేశాం: ఉండవల్లి

30 Jul, 2016 11:26 IST|Sakshi
ఎందుకీ కక్ష, మేం ఏం తప్పు చేశాం: ఉండవల్లి

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని అందుకే  ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నామన్ని ఆయన శనివారమిక్కడ అన్నారు. హోదా ఎందుకు అమలు చేయడం లేదో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు.

ఏపీ ప్రజలపై ఎందుకింత కక్ష అని, ఏ తప్పు చేశామని ఉండవల్లి ఈ సందర్భంగా నిలదీశారు. కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీయడం లేదన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు.  పోలవరం  పూర్తయితే 2వేల టీఎంసీల నీటిని వాడుకోవచ్చని,  అవసరం అయితే ఒడిశాకు నీళ్లు అందించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు