మహంకాళి ఆలయంలో ప్రారంభమైన బోనాలు

22 Jul, 2016 18:29 IST|Sakshi

ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరీ దేవాలయంలో 67వ బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గణపతి పూజ, పుణ్యహవచనము, రుత్విక్ వరణం, దీక్షారాధన, అఖండ దీపస్థాపన, నవగ్రహారాధన, కలశస్థాపన, అమ్మవారి అభిషేకం, సాయంత్రం 6 గంటలకు అమ్మ వారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, మహా మంగళ హారతి తదితర కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ కమిటీ చైర్మన్ జె.శంకరయ్య గౌడ్, కమిటీ సభ్యులు సురేందర్ ముదిరాజ్, మధుసూదన్ గౌడ్, వి.అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు