వికసించిన బ్రహ్మకమలం

20 Sep, 2016 00:35 IST|Sakshi
వికసించిన బ్రహ్మకమలం
 కాజీపేట : ప్రశాంత్‌నగర్‌ కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి లెక్కల ప్రకాష్‌రెడ్డి గృహంలో ఆదివారం రాత్రి బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. దీంతో కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇంటినే హరిత వనంగా మార్చుకున్న ప్రకాష్‌రెడ్డి  ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం మొక్కను పెంచుతున్నాడు. మూడేళ్లుగా వికసిస్తున్న ఈపుష్పాలు  ఏడాదికి ఒకసారి మాత్రమే అదికూడా రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో విచ్చుకోవడం ప్రారంభిస్తాయి. ఆదివారం రాత్రి ఈ విషయం గుర్తించిన ప్రకాష్‌రెడ్డి బంధు మిత్రులకు చెప్పడంతో కాలనీవాసులతో సహా అందరూ వచ్చి తిలకించారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బ్రహ్మకమలం పుష్పాలు యాధావిధిగా ముడుచుకుని పోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   
>
మరిన్ని వార్తలు