అబద్ధాల బాబు: సి.రామచంద్రయ్య

9 Jan, 2016 03:57 IST|Sakshi
అబద్ధాల బాబు: సి.రామచంద్రయ్య

సాక్షి, హైదరాబాద్: అబద్ధాలతో 19 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఇందిర భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కులాలు, పార్టీల వారీగా విభజించి పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో 96 శాతం పరిష్కరించినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించకపోతే ముఖ్యమంత్రి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు