చింతలపూడి: చింతలపూడి పట్టణానికి చెందిన గ్రాండ్ టైల్స్ అండ్ ఫర్నిచర్స్ షాపులో శనివారం తెల్లవారు జామున దొంగతనం జరిగింది. షాపు వెనుక ఉన్న సిమెంట్ కిటికీ బద్దలు కొట్టి లోపలికి ప్రవేసించిన దొంగలు డ్రాయర్ సొరుగులోని 22 వేల నగదును దొంగిలించుకుపోయారు. ఉదయం షాపు తెరిచి చూడగా దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న షాపు యజమాని హమీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ సైదానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.