చంద్రబాబుకు హోదా కంటే ప్యాకేజీనే ముఖ్యం

17 May, 2016 11:20 IST|Sakshi

గోపాలపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని, వచ్చిన నగదును తన ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఫీవుల్లా బేగ్ విమర్శించారు.

వేళ్లచింతలగూడెంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హాదాపై ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయకుండా పట్టిసీమ పేరుతో కమీషన్లు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమర్‌హాన్ బేగ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాకలపాటి సుబద్రాదేవి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు