'ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి'

26 Feb, 2016 14:26 IST|Sakshi

కడప : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టు తిరుగుతూ రాయలసీమను పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు  మండిపడ్డారు. శుక్రవారం కడపలో ఆ పార్టీ నాయకులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... చివరికి తాను రాయలసీమ ద్రోహి కాదని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. 

చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఈ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని చంద్రబాబు సర్కార్పై బీవీ రాఘవులు, కె. రామకృష్ణ నిప్పులు చెరిగారు.  
 

మరిన్ని వార్తలు