ఖమ్మంక్రైం: జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీగా పనిచేస్తున్న సాయిశ్రీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీ అయ్యారు. సాయిశ్రీ జిల్లా షీ టీం ఇన్చార్జిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె మెుదటి పోస్టింగ్ వైరా సబ్ డివిజన్లో నిర్వహించారు. బదిలీ అయిన ఆమెకు మంగళవారం ఓ రెస్టారెంట్లో డీటీసీ సిబ్బంది వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు ఎస్పీ సాయికృష్ణ హాజరయ్యారు. రెండేళ్ల పాటు ట్రైనింగ్ కానిస్టేబుల్స్కు, శిక్షణ పొందిన ఎస్సైలకు ఏ విధంగా విధులు నిర్వర్తించాలనే అంశంపై సాయిశ్రీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి అధికారుల మన్ననలు పొందారని కొనియాడారు. జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీంతో పాటు ఇతర సిబ్బంది ప్రోత్సాహంతో తాను సమర్థవంతంగా పనిచేసే అవకాశం దక్కిందని సాయిశ్రీ అన్నారు. అనంతరం ఆమెను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఎంటీఓ నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.