టీటీడీ కళ్యాణ మండపంలో..

3 Sep, 2016 23:22 IST|Sakshi
టీటీడీ కళ్యాణ మండపంలో..

హిమాయత్‌నగర్‌: లిబర్టీ వద్ద ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ‘సిల్క్‌ కాటన్ ఎక్స్‌పో’ అదరహో అంటోంది. క్రాఫ్ట్‌ వీవర్స్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఎగ్జిబిషన్ మహిళలను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరం నలుమూలల నుంచి యువత, మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి తమకు కావాల్సిన చీరెలను కొనుగోలు చేసుకుంటున్నారు. దాదాపు 25 రకాల చీరెలు, డ్రస్‌ మెటీరియల్స్‌ ఈ ఎగ్జిబిషన్లో ఉంచినట్లు నిర్వాహకులు అక్బర్‌ అలీ తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు.  

 

మరిన్ని వార్తలు