బావిలో దూకి రైతు ఆత్మహత్య

30 Sep, 2015 12:01 IST|Sakshi

వికారాబాద్‌ : అప్పుల బాధతో ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న నారెగూడెం శ్రీనివాసరెడ్డి (48) తనకున్న ఎకరం పొలంతో మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని కూరగాయలతోపాటు పత్తి సాగు చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇటీవల పొలంలో బావి తవ్వించాడు.

అలాగే తన ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. దీంతో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం కానరాక మంగళవారం రాత్రి అతడు బావిలో దూకి తనువు చాలించాడు. అయితే భర్త శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతి అని అతడి భార్య అనంతమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు