పిల్లలతో సహా కానిస్టేబుల్ ఆత్మహత్య

30 Jul, 2016 12:25 IST|Sakshi
పిల్లలతో సహా కానిస్టేబుల్ ఆత్మహత్య

చల్లపల్లి : తన ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. మోపిదేవి మండలం పెదప్రోలుకు చెందిన యదలపల్లి రమేష్ (38) అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతనికి కార్తీక్ (7), శ్రావ్య (4)  పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి తన ఇద్దరు పిల్లలను బైక్పై ఎక్కించుకొని ఇంటి నుంచి వెళ్లిన రమేష్... ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.

దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కోడూరు మండలం సాగరసంగమం వద్ద రమేష్ బైక్ను పోలీసులు గుర్తించారు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సముద్ర తీరంలో రమేష్, శ్రావ్యల మృతదేహాలు లభించాయి. కార్తీక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమేష్ పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు