రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా

23 Sep, 2016 01:54 IST|Sakshi
రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా
  • సీఎంఎం సత్యనారాయణ
  • నెల్లూరు(సెంట్రల్‌) : రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తే రూ.500 వరకు జరిమానా విధిస్తామని సికింద్రాబాద్‌ డివిజన్‌ చీఫ్‌ మెటీరియల్‌ మేనేజర్‌ (సీఎంఎం) సత్యనారాయణ అన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో గురువారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారంరోజుల పాటు దేశంలోని అన్ని రైల్వేస్టేషన్‌లలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరైనా స్టేషన్‌లో చెత్త వేస్తే జరిమానా వేస్తామని చెప్పారు. అంతకుముందు స్వచ్ఛ నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ టికెట్‌ మేనేజర్‌ సాగర్, రమేష్, మునీర్, నాయక్, ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌ కుమార్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు