తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం

10 Aug, 2015 14:03 IST|Sakshi

తిరుమల: తిరుమల కొండల్లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పాపవినాశనం మార్గంలో వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఆకస్మాత్తుగా మంటలు ఎగిసి పడ్డాయి. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. 

దాంతో అటవీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.  అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు