- ఐదుగురికి గాయాలు
పూతలపట్టు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేము ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనగా ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చిత్తూరు వైపు వెళుతున్న బస్సు స్టేజీ వద్ద ఆపుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. గాయపడిన ప్రయాణికులకు పూతలపట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.