భీమవరం : భీమవరం గునుపూడిలోని విద్యాగణపతి ఆలయంలో స్వామిని బుధవారం పంచామృతాలతో అభిషేకించి విశేష పూజలు చేశారు. ఆకెళ్ల విజయసారధి దంపతులు అభిషేకం నిర్వహిం చారు. అర్చకుడు ఘంటశాల సో మేశ్వరశర్మ సహకారంతో స్వామిని ఆనబకాయలు, పొట్లకాయలతో అలంకరించారు. గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు చెరుకుపల్లి సంతోష్, కార్యదర్శి బ్రహ్మజోశ్యుల సుబ్బయ్య, వేలూరి కిరణ్, మధుర అయ్యప్ప ఉన్నారు.