అమరావతి (గుంటూరు రూరల్) : అమరావతిలో భక్తులకు సేవలందించేందుకు కర్నాటకకు చెందిన బళ్ళారి జిల్లా హంపీకి చెందిన పోలీసులు 184 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కర్నాటక నుంచి దాదాపు 400 మంది సిబ్బంది ఆంధ్రాకు వచ్చారు. భాష సమస్య ఉన్నా భక్తులకు సేవలందిస్తున్నామని తెలిపారు. భక్తులు ఎంతో క్రమశిక్షణగా స్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇబ్బందులున్నా భక్తుల ఆసక్తిని చూసి విధులు నిర్వహిస్తున్నామన్నారు.