మేళ్లచెర్వులో హోం మంత్రి ఏరియల్‌ సర్వే

19 Jul, 2016 22:56 IST|Sakshi
బుగ్గమాధవరం (మేళ్లచెర్వు) : మండలంలోని బుగ్గమాధవరం, వజినేపల్లి, కిష్టాపురం వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంగళవారం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఘాట్ల ఏర్పాట్లును పరిశీలించారు. వారి వెంట డీజీపీ అనురాగ్‌ శర్మ, ఐజీ నాగిరెడ్డి ఉన్నారు. కాగా, ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ.రవికుమార్‌ పర్యవేక్షించారు.
 
మరిన్ని వార్తలు