తిరుపతిలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

1 Nov, 2015 10:25 IST|Sakshi

తిరుపతి: తిరుపతి నగరంలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.46 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు 2 ఎల్సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

ఆ క్రమంలో తిరుచానూరులో నివాసం ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు