దిగ్విజయ్ తో జగ్గారెడ్డి మంతనాలు

30 Jul, 2015 13:43 IST|Sakshi
దిగ్విజయ్ తో జగ్గారెడ్డి మంతనాలు

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తో గురువారం భేటీ అయిన ఆయన మంతనాలు జరుపుతున్నారు.  త్వరలో జగ్గారెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా గత సాధారణ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు.

తెలంగాణ ముఖ్యమంత్రి మెదక్ లోక్‌సభ సీటుకు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి.... బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో ఇమడలేక, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

 

మరిన్ని వార్తలు