పనాజీ: మద్యం మత్తులో ఓ 40 ఏళ్ల నేపాలీ వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు నకిలీ ఫోన్ చేసి కటకటాలపాలయ్యాడు. నీలమ్ బహుదర్ పేరుతో అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చిందని ఎస్పీ ఉమేశ్ గోంకార్ తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి గోవాలోకి ఏడుగురు తీవ్రవాదులు చొరబడి అల్లకల్లోలం సృష్టించపోతున్నారంటూ చెప్పాడని ఎస్పీ పేర్కొన్నారు.
దాంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించగా, అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందని చెప్పారు. గురువారం ఉదయం ఫోన్ ఆన్లో ఉండటంతో సిగ్నల్ ఆధారంగా దక్షిణ గోవాలోని కార్టలీమ్ గ్రామంలో అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కంట్రలోల్ రూంకు ఫోన్ కాల్ చేసిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని అతడు నేరాన్ని అంగీకరించినట్టు చెప్పారు. బహుదర్ను తాము ఇంకా ప్రశ్నిస్తున్నట్టు ఎస్పీ గోంకార్ పేర్కొన్నారు.
కంట్రోల్ రూంకు నకిలీ ఫోన్కాల్, నేపాలీ అరెస్ట్
Published Thu, Jul 30 2015 1:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement