జమ్మలమడుగు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా సులోచన రెడ్డి

12 Dec, 2016 15:10 IST|Sakshi

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జమ్మలమడుగు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా ఎర్రగుంట్ల మండలానికి చెందిన వెన్నపూస సులోచన రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.ఈమేరకు గురువారం ఇందిరా భవన్‌లో నియామక పత్రాన్ని అందజేశారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ  పార్టీ అభివృద్దికి  కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ పార్టీ అని 2019 ఎన్నికల్లో  రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్‌ సెక్రటరీ సత్తార్, జాయింట్‌ సెక్రటరీ చంద్రశేఖర్, సేవాదళ్‌ చైర్మన్‌ చార్లెస్,మహిళా సేవాదళ్‌ చైర్మన్‌ గౌసియా,ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ధ్రువకుమార్‌ రెడ్డి  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు