రేపు క్వాయర్‌ బోర్డులో జాబ్‌మేళా

12 Oct, 2016 22:07 IST|Sakshi
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
జిల్లాగ్రామీణాభివృద్ధిసంస్థ ఆధ్వర్యలో ఈనెల 14న రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం రోడ్‌ దగ్గర ఉన్న క్వాయర్‌బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు ఎస్‌.మల్లిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం షైన్‌డోవ్‌ కంపెనీలో పనిచేయుటకు కస్టమర్‌కేర్‌(మహిళలు),బిజినెస్‌డవలప్‌మెంట్‌(పురుషులు) డిగ్రీ పాసై, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరిజిల్లాల్లో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌లో రిటైల్‌ స్టోర్‌ మేనేజర్‌(బీఎస్సీ/ఎంబీఏ/అగ్రికల్చర్‌ డిప్లమో/అగ్రికల్చర్‌)గా పనిచేయుటకు 20 నుంచి 30సంవత్సరాల వయస్సు గల పురుషులు కావాలన్నారు. కావున అర్హత కల్గిన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు నకలు, రేషన్‌కార్డు నకలుతో హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు సెల్‌ : 94413 59873ను సంప్రదించాలన్నారు.
 
మరిన్ని వార్తలు