శ్రీశైలంలో జస్టిస్ నాగార్జున్‌రెడ్డి పుష్కరస్నానం

15 Aug, 2016 00:20 IST|Sakshi
శ్రీశైలంలో జస్టిస్ నాగార్జున్‌రెడ్డి పుష్కరస్నానం

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదివారం తెల్లవారుజామున శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద పిండ ప్రదానం చేసిన అనంతరం పుష్కర స్నానం ఆచరించారు. ఆ తర్వాత హరిహరరాయ గోపురం వద్ద దేవస్థానం ప్రొటోకాల్ అధికారులు శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సాదర స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలుకగా..జేఏఈ హరినాథ్‌రెడ్డి ఆలయ మర్యాదలతో శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.

 

>
మరిన్ని వార్తలు