60వేల మంది బీసీలకు కల్యాణలక్ష్మి

27 Jun, 2016 15:56 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 60 వేల మంది బీసీలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేయనున్నట్లు బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గంగాధర్ తెలిపారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో బీసీ సంక్షేమ సంఘాల వారితో సమావేశమయ్యారు. కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని కోరారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని చెప్పారు. బీసీల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు