బోల్తాకొట్టిన లగ్జరీ బస్సు

4 Oct, 2015 10:34 IST|Sakshi

అవుకు(కర్నూలు): వేగంగా వెళ్తున్న లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.

విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న లగ్జరీ బస్సు రిజర్వాయర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. బస్సు రోడ్డుపక్కన ఉన్న గుంటలో పడిపోవడంతో.. బస్సులో ఉన్న 34 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు.

మరిన్ని వార్తలు