విశాఖపట్టణం: విశాఖ నగరంలో ప్రియురాలిని హత్య చేశాడొక కిరాతకుడు. సతీష్ అనే వ్యక్తి ఉన్మాదంతో ప్రియురాలి గొంతు కోసి చంపేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.
సతీష్ను ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. పూర్ణ మార్కెట్ పండా వారి వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.