పుట్టపర్తి టౌన్ : సంస్కృతీ మేనేజ్మెంట్ కళాశాల ఆధ్వర్యంలో విజయోత్సవ్–2017 పేరుతో ఈనెల 11,12 తేదీల్లో కళాశాలల్లో మేనేజ్మెంట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు సంస్కృతీ విద్యాసంస్థల గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కళాశాలలో బుధవారం సిబ్బందితో కలిసి ఆయన విజయోత్సవ్–2017 పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కళాశాలతో పాటు జర్మనీకి చెందిన రైజ్ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దేశీయంగా ప్రఖ్యాతి గాంచిన ఐదు కార్పొరేట్ సంస్థలు ఈ వేడుకలో పాల్గొంటాయన్నారు. విద్యార్థులకు పలు అంశాలపై వేదిక కల్పిస్తారని, ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా మేనేజ్మెంట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9100974543 ,91009745538 నెంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసన్, సిబ్బంది పాల్గొన్నారు.