విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి

6 Mar, 2017 00:11 IST|Sakshi
అమినాబాద్‌(తుగ్గలి) : మండలంలోని అమినాబాద్‌ గ్రామానికి చెందిన   బాలరాజు(28) అనే వ్యక్తి ఆదివారం అనంతపురం జిల్లా పామిడిలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బాలరాజు  విద్యుత్‌ లైను మరమ్మతుల పనికి   వెళ్లాడు. రోజూలాగే ఊరి నుంచి వెళ్లి పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై సృహ తప్పి పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి  బాలరాజుకు భార్య లలిత,   కూతురు ఉంది. మృతి వార్త తెలియగానే కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 
మరిన్ని వార్తలు