తాడిపత్రి మార్కెట్‌ కమిటీ గడువు పొడిగింపు

25 Oct, 2016 23:09 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : తాడిపత్రి వ్యవసాయ మార్కెట్‌ యార్డు కమిటీ పాలక వర్గం గడువు ఆరు నెలలు పొడిగిస్తూ ఆ శాఖ సెక్రటరీ, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బీ రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మొదట నిర్ణయించినట్లు ఒక సంవత్సరం కాలపరిమితి గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున ఉన్న పాలకవర్గానికి మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు