అనంతపురం అగ్రికల్చర్ : తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ పాలక వర్గం గడువు ఆరు నెలలు పొడిగిస్తూ ఆ శాఖ సెక్రటరీ, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొదట నిర్ణయించినట్లు ఒక సంవత్సరం కాలపరిమితి గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున ఉన్న పాలకవర్గానికి మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.