సీఎం నాటిన మొక్కను పరిశీలించిన ఎమ్మెల్యే

28 Jul, 2016 19:59 IST|Sakshi
సీఎం నాటిన మొక్కను పరిశీలించిన ఎమ్మెల్యే
గుండ్రాంపల్లి(చిట్యాల): మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ శివారులో హైవే పక్కన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ నాటిన వేప మొక్కను గురువారం నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. వేప మొక్కకు ట్రీ గార్డును ఏర్పాటు చేయాలని, హైవే పక్కన నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన స్థానిక అటవీశాఖ, ఇతర అధికారులను ఆదేశించారు. ఆయన వెంట నార్కట్‌పల్లి ఎంపీపీ రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కోమ్మనబోయిన సైదులు తదితరులున్నారు. 
 
>
మరిన్ని వార్తలు