మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

15 Oct, 2016 11:01 IST|Sakshi

కామారెడ్డి రూరల్‌: గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణ పనులను వేగవం తం చేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డంపింగ్‌ యార్డు, శ్మశానవాటికల పనులలతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభిం చాలని, హరితహా రంలో భాగంగా మొ క్కలు నాటిన కూలీ ల కు డబ్బులు చెల్లించాలని, మొక్క ల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏపీవో సాయిబాబా, టెక్నికల్‌ అసిస్టెంట్లు మహిపాల్‌రెడ్డి, నరేశ్, స్వప్న, ఆయా గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు