జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బుచ్చిరెడ్డి ఎంపిక

25 Aug, 2016 22:48 IST|Sakshi
మిడ్జిల్‌: జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మండలంలోని దోనూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి ఎంపికైనట్లు పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు ఎల్లయ్య తెలిపారు. మండలలోని గుడిగాన్‌పల్లి గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి గతేడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. అవార్డును సెప్టెంబర్‌ 5వ తేదీన డిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారని ఆయన తెలిపారు.
 
 
మరిన్ని వార్తలు