ప్రొఫెసర్ల విడుదలపై వీడని ఉత్కంఠ

8 Aug, 2015 02:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ప్రొఫెసర్లు ఇంకా విడుదల కాలేదు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ వారి విడుదలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అల్వాల్‌కు చెందిన ప్రొఫెసర్ చిలివేరు బలరాం కిషన్, నాచారానికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే అర్ధరాత్రి వరకూ విడుదలపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు