ఉప్పొంగిన భక్తిభావం

8 Jan, 2017 23:40 IST|Sakshi
రావణవాహనంపై మల్లికార్డునుడు
జిల్లాలో ఆదివారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వైష్ణవ దేవాలయాల్లో స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. అహోబిలంలో లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహనంపై విహరించారు. మహానందిలో కోదండ రామస్వామికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురంలో మద్దిలేటయ్య కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాలలో వేంకటేశ్వర స్వామిని స్వర్ణ హరిత అలంకారంలో పూజలందుకున్నారు.
- సాక్షి నెట్‌వర్క్‌
మరిన్ని వార్తలు