పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబలదిన్నెలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీఎన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలను విద్యాశాఖాధికారులు సోమవారం మూసివేశారు. నెలరోజులుగా అనుమతి లేకుండా స్కూలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం ధర్నా చేయడంతో మేలుకున్న ఎంఈఓ ఖాజామోహిద్దీన్ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డుల కోసం ఆరా తీయగా సిబ్బంది తెలియదని చెప్పడంతో మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులను బయటకు పంపి తాళం వేశారు. ఈ కారణంగా స్కూల్లో చేరిన 124 మంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు.