లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామం వద్ద ప్రధానరహదారిపై కంకరలోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వెంకట్రావు(55) అనే వ్యక్తి మృతిచెందాడు. వెంకట్రావు స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ గ్రామం. కూలీ పనుల నిమిత్తం ఇటిక్యాల వచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.