కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు వారం రోజుల విరామం తర్వాత శుక్రవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి క్రయ, విక్రయాలు జరిగాయి. దాదాపు 15 లారీల ఉల్లి మార్కెట్కు వచ్చింది. క్వింటాల్కు కనిష్టంగా రూ.160 గరిష్టంటా రూ.780 ధర లభించింది. రైతులకు కేవలం 10 శాతం మొత్తం మీద చెల్లించారు. మిగిలిన మొత్తం చెక్ల రూపంలో చెల్లిస్తారు. ఉల్లి మినహా మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు ఇంకా మొదలు కాలేదు.