విశాఖ బాక్సర్లకు ఓవరాల్ చాంప్

5 Jul, 2013 05:03 IST|Sakshi
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్సార్ మెమోరియల్ రాష్ట్ర సబ్‌జూనియర్ బాలుర బాక్సింగ్ పోటీల్లో విశాఖపట్నం బాక్సర్లు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. బుధవారం పోటీల ముగింపు ఉత్సవానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత క్రీడలు ఆవశ్యకతను గుర్తెరగాలని పిలుపునిచ్చారు.  వైఎస్సార్‌సీపి అధికార పార్టీ ప్రతినిధి పీలా ఉమారాణి ప్రసంగించారు.
 
 ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను  (శాయ్) స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా  హాస్టల్‌కు చెందిన బాక్సర్లు (విశాఖ) 75 పాయింట్లుతో దక్కించుకున్నారనిరాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి జీవీ రవిరాజ్  చెప్పారు. హెచ్‌బీఎస్ (హైదరాబాద్ బాయ్స్ స్పోర్ట్సు)కు చెందిన బాక్సర్లు 65 పాయింట్లుతో రన్నర్స్‌గా నిలిచారని తెలిపారు, బెస్ట్ బాక్సర్ టైటిల్‌ను వంకాయల సాయికుమార్, బెస్టలూజర్ టైటిల్‌ను వి. జ్యోతి స్వరూప్ కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు.  ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా అర్జున అవార్డు గ్రహీత శీరం జయరామ్ ఎస్‌వి శర్మ, ప్రసాద్, దండు నాగేశ్వరరావు, దల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ రామకృష్ణ, కృష్ణారెడ్డి  వ్యవహరించారు. మారుతీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
 
మరిన్ని వార్తలు