'ప్రతిపక్షం లేకుండా చేయాలని బాబు కుట్ర'

1 Jun, 2016 12:11 IST|Sakshi

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు బుధవారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బాబు కొంటున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై అన్ని పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని పి. మధు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు