పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి!

19 Jul, 2016 19:40 IST|Sakshi
పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి!

వనిపెంట(మైదుకూరు):
 ఈమె పేరు మోతె వీరమ్మ (66). గ్రామం వనిపెంట. భర్త పోతులూరు ఏడేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి  వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటూనే ఉంది. కాళ్లరిగేలా జన్మభూమి కార్యక్రమాలకు, అధికారుల దగ్గరకు తిరుగుతూనే ఉంది. కానీ ఇంత వరకు వితంతు, వృద్ధాప్య పింఛన్‌ ఏదీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇళ్లు, పొలం ఏమీ లేవని, తనకు ఎవ్వరూ లేరని పింఛన్‌ డబ్బులతో జీవనం సాగిస్తానని అధికారులను ప్రాధేయపడుతోంది. అధికారులు  స్పందించి తనకు పింఛన్‌ మంజూరు చేయాలని ఆమె వేడుకుంటోంది.
 

మరిన్ని వార్తలు