బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

20 Sep, 2015 17:50 IST|Sakshi

కర్నూలు: బ్లాక్‌మనీ తరలిస్తున్న ముగ్గుర్ని కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కారులో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి కర్నూలుకు తరలిస్తుండగా బనగానపల్లె వద్ద వీరిని పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన సయ్యద్ అహ్మద్, షఫీక్ అహ్మద్, ఫిరోజ్ బాషాలు కర్నూలు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులను ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

>
మరిన్ని వార్తలు