చిన్నపరిశ్రమల సంఘం అధ్యక్షుడిగా పార్థసారథి

8 Aug, 2016 23:30 IST|Sakshi
చిన్నపరిశ్రమల సంఘం అధ్యక్షుడిగా పార్థసారథి
విజయవాడ(ఆటోనగర్‌) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడిగా టి.పార్థసారథి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌(చిన్న తరహా పరిశ్రమల సంఘం) 53వ సర్వసభ్య సమావేశం ఆటోనగర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ భవనంలో సోమవారం నిర్వహించారు. ఉపాధ్యక్షుడుగా టి.వినోద్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.రామకృష్ణ, కోశాధికారిగా అన్నే శివనాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆటోనగర్‌ ఐలా చైర్మన్‌ సుంకర దుర్గాప్రసాద్, జేఆర్‌టీ టాటా ఎస్టేట్స్‌ ఐలా చైర్మన్‌ రమేష్‌ పాల్గొన్నారు.
 
 
 
 
 
మరిన్ని వార్తలు