విద్యార్థిని ఆత్మహత్య

14 Apr, 2017 23:48 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఫెయిలయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నగరంలో కళ్యాణదుర్గం రోడ్డుకు సమీపంలోని పాపంపేటలో నివాసమున్న పద్మక్క కుమార్తె రాజేశ్వరి నగరంలో ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. గురువారం విడుదలైన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్‌ అయింది. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున కుటుంబసభ్యులు గమనించారు. కాగా టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు