పిండప్రదానం చేస్తూ వ్యక్తి మృతి

16 Jul, 2015 13:44 IST|Sakshi

ధవళేశ్వరం (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఉన్న గాయత్రి పుష్కరఘాట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఓ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ అయిన విజయవాడకు చెందిన మహంకాళి సుబ్బయ్య(65) గురువారం పుష్కరస్నానం చేసేందుకు గాయత్రిఘాట్‌కు చేరుకున్నారు. కాగా, పిండ ప్రదానం చేసే సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.

కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇవ్వగా, ఆ వాహనం అక్కడికి చేరుకునేలోగానే సుబ్బయ్య తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు