కోదండరాముని సన్నిధిలో జిల్లా ఎస్పీ

26 Jul, 2016 00:20 IST|Sakshi

ఒంటిమిట్ట :
ఒంటిమిట్ట కోదండరాముడిని జిల్లాఎస్పీ పీహెచ్‌డీ రామక్రిష్ణ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎస్పీకి ఆలయ విశిష్టతల గురించి తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. పూలమాలలు, స్వామివారి శేషవస్త్రంతో ఎస్పీని సత్కరించారు.

మరిన్ని వార్తలు