తాటి, ఈత మొక్కలు నాటుతున్నాం

1 Sep, 2015 14:51 IST|Sakshi

వరంగల్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత మొక్కలను ఎక్సైజ్ శాఖ ద్వారా చెరువు గట్లపై నాటుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు. ఆ చెట్లను కాపాడుకునే బాధ్యత ప్రజలదే అని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో మంగళవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పద్మారావు పాల్గొన్నారు. అలాగే అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు